మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేసీఆర్కు అమ్ముడుపోయిన గవర్నర్: వీహెచ్
Published on Sun, 01/07/2018 - 02:26
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు గవర్నర్ నరసింహన్ అమ్ముడుపోయారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, గవర్నర్ ఏకపక్షంగా పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గవర్నర్ పదవిని కాపాడుకోవడానికి చెంచాగిరీ చేస్తున్నారని ఆరోపించారు. గుళ్లు, గోపురాలు తిరగడానికి తప్ప గవర్నర్ దేనికీ పనికిరారని విమర్శించారు. ఇలాంటి గవర్నర్ను కలిస్తే ప్రయోజనం ఏమీ లేదన్నారు. రైతులకు నాణ్యమైన కరెంటును ఇస్తే సరిపోతుందని, 24 గంటల కరెంటు అవసరంలేదన్నారు. ఈ సమస్యలను గవర్నర్కు ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. గ్రామగ్రామాన తిరిగి ప్రజలకే చెప్పాలని వీహెచ్ అన్నారు.
#
Tags