ఓటు వేస్తే.. పెట్రోలుపై డిస్కౌంట్‌

Published on Thu, 04/11/2019 - 14:50

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల సందర‍్భంగా ఓటర్లకు గుడ్‌ న్యూస్‌. పోలింగ్‌లో ఓటింగ్‌ శాతానికి పెంచేందుకు పెట్రోలు డీలర్లు  బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడదల ఎన్నికల్లో మీరు ఓటు వేసిన తర్వాత పెట్రోల్‌గానీ, డీజిల్‌ గానీ కొనుగోలు చేస్తే దానిపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసిన వారికి లీటరుపై 50 పైసలు డిస్కౌంట్‌ లభిస్తుంది.

దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆఫర్‌ అందుబాటులోఉంటుంది. అయితే ఓటు వేసిన గు​ర్తును (వేలిపై ఇంకు గుర్తు) పెట్రోల్‌ బంకుల్లో చూపించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. పోలింగ్‌ రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ఆల్‌ ఇండియా పెట్రోలియమ్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.  ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్‌ ఇండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజయ్‌ బన్సల్‌ తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌లో పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 11న ఓటు హక్కును వినియోగించుకున్న వారికి  పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలుపై 50పైసలు డిస్కౌంట్‌  అందిస్తున్నట్టు  ఉత్తరాఖండ్‌ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

పోలింగ్‌ రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్‌ లేదా డీజిల్‌పై మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. కాగా స్వార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌  నేడు ( ఏప్రిల్‌ 11న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ