తిరువనంతపురం విజేత ఎవరు?

Published on Mon, 04/22/2019 - 15:57

సాక్షి, తిరువనంతపురం: తెల్లటి కద్దరు చొక్కా, దోవతి ధరించిన కుమ్మనం రాజశేఖరన్‌ బీజీపీ అభ్యర్థిగా తిరువనంతపురం కోక్‌సభ నియోజక వర్గంలో ఆదివారం వరకు విస్తతంగా పర్యటించారు. కచాని నుంచి కేశవదాసపురం వరకు సాగిన ఆయన ఎన్నికల యాత్రలో ఆయన  ఎదురైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా, ఆయన పార్టీ కార్యకర్తలు దారి పొడువున ఆయనకు కాషాయ, ఆకుపచ్చ కండువాలు కప్పుతూ ‘భారత మాతాకు జై’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల మాట్లాడుతూ తాను నియోజకవర్గం అభివద్ధికి కృషి చేయడంతోపాటు సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తానంటూ ‘వివాదాస్పద శబరిమల’ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కృషి చేయగా, బీజేపీ, ఆరెస్సెస్‌ సంస్థలు అందుకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. తద్వారా బీజేపీ తిరువనంతపురం ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంది. తొలుత, సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ సమర్థించింది. గణనీయ సంఖ్యలో సుప్రీం తీర్పును ప్రజలు వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావడంతో బీజేపీ తన వైఖరిని మార్చుకొని ప్రత్యక్షంగా ఆందోళనలకు దిగింది. గత 70 ఏళ్లుగా రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ వస్తున్నాయని, ఈసారి ఆ మార్పు తిరువనంతపురంలో బీజేపీకి అనుకూలంగా మారుతుందని రాజశేఖరన్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. 

వరుసగా గత రెండు ఎన్నికల్లో తిరువనంతపురంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశిథరూర్‌ విజయం సాధిస్తూ వచ్చారు. మూడవ విడతగా తిరువనంతపురంలో ఏప్రిల్‌ 23వ తేదీన పోలింగ్‌ జరుగుతోంది. ఒక్క ఈ నియోజకవర్గంలోనే కాదు, మొత్తం కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏనాడు విజయం సాధించలేదు. ఈసారి శబరిమల వివాదం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకని రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ 14, మిత్రపక్షాలు ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మిత్రపక్షమైన భారత ధర్మసేన ఐదు, కేరళ కాంగ్రెస్‌ (థామస్‌) ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నాయి. 

తిరువనంతపురం సీటును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని ఉవ్యూళ్లూరుతున్న బీజేపీ, రాజశేఖరన్‌ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఆయన విజయం కోసం భారీ ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చినట్లు తెల్సింది. మరో పక్క ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆరెస్సెస్‌ స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను ఇక్కడికే పంపించింది. అయితే ఆయన విజయం అంత సులువుకాదు, కచ్చితమూ కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశిథరూర్‌యే కాకుండా ఎల్‌డీఎఫ్‌ తరఫున బలమైన అభ్యర్థి, మాజీ మంత్రి సీ. దివాకరన్‌ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో శశిథరూర్‌ మొదటిసారి 99,998 ఓట్ల మెజారిటీ తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పీ. రామచంద్రన్‌ నాయర్‌పై విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి పీ. కష్ణదాస్‌ కేవలం 84,094 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో కూడా శశిథరూర్‌ రెండోసారి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్‌ రెండో స్థానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో శశిథరూర్‌ మెజారిటీ 15,470 ఓట్లకు పడి పోవడం గమనార్హం. 

ఈ నియోజకవర్గంలో బీజేపీ 1998 నుంచి తన పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది. 1998లో 12.39 శాతం ఓట్లురాగా, 1999లో 20.93 శాతం, 2004లో 29.86 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోలింగ్‌ శాతం దారుణంగా 4.8 శాతంకు పడిపోయింది. అది 2009లో 11.4 శాతానికి, 2014లో 32.32 శాతానికి పెరిగింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం జిల్లాలోని నిమామ్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. 

Videos

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)