అన్న వస్తున్నాడు..

Published on Sat, 04/06/2019 - 12:41

విశాఖసిటీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన జిల్లాకు రానున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జననేత ఆ తర్వాత పాడేరు, పాయకరావుపేటలో పర్యటించారు. ఐదో విడతగా జిల్లాలో అడుగు పెడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 11.30 గంటలకు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ తరపున జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం 4 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. గాజువాక నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ