amp pages | Sakshi

చంద్రబాబుది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష!

Published on Mon, 04/30/2018 - 14:22

సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో దీక్షలు, సభలు అంటూ రకరకాల మోసపూరిత ఎత్తుగడలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష అని నిప్పులు చెరిగారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో సోమవారం చేపట్టి ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు ఏమన్నారంటే..

కేంద్రంతో చంద్రబాబు లాలూచీ
చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు నమ్మారని, కానీ ఆయన ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. దొంగ దీక్షలతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ముందుకొస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీని అద్భుతమంటూ.. దానిని చంద్రబాబు అంగీకరించారని, ప్రజల్లో వ్యతిరేకతను చూసి మళ్లీ ఆయన యూటర్న్‌ తీసుకున్నారని ధర్మాన గుర్తుచేశారు. మీరే అన్యాయం చేసి.. మీరే దీక్ష చేస్తానంటే ప్రజలు నమ్మరని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని, ఇప్పుడు తనను ప్రజలే కాపాడాలని చంద్రబాబు వేడుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అభ్యర్థించారు.

అది దీక్ష కాదు.. కక్ష
చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. అది తెలుగువారి కక్ష అని వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. విభజన చట్టంలో ఏ ఒక్క హామీపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటు, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది అని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక హోదా మన హక్కు, మన దిక్కు, మన లక్కు అని ఆయన పేర్కొన్నారు. ఓట్లరూపంలో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.

ముఖ్యమంత్రే దీక్ష చేయడమేంటి?
హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అభివర్ణించారు. చంద్రబాబు ‘ఆల్‌ ఫ్రీ’ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

నాలుగేళ్లుగా వంచిస్తూనే ఉన్నాడు
చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూనే ఉన్నాడని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. హోదా మాట రాష్ట్రంలో వినపడకుండా కుట్రలు చేసిన బాబు ఇప్పుడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇన్ని రోజులు హోదా మాటా ఎత్తని చంద్రబాబు ఇప్పుడు కొంగ జపాలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.

చంద్ర బాబు లెంపలు వేసుకోవాలి
రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన అన్యాయానికి​ చంద్రబాబు చెంపలు వేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు, పోలవరం కమీషన్ల వ్యవహారం, రాజధాని నిర్మాణంలో అవినీతిపై చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని కోటం రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబుకు జగన్‌ భయం పట్టుకుంది
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర,  చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ  పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే బాబు ధర్మ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసినందుకుగాను చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు.

Videos

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)