సల్మాన్ భట్, ఆసిఫ్ పునరాగమనం

Published on Mon, 01/11/2016 - 03:33

కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటుకున్నారు. ఇటీవలే వీరి సస్పెన్షన్ కాలం ముగియడంతో పాక్ జాతీయ వన్డే కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. ఆదివారం డబ్ల్యుఏపీడీఏ జట్టు తరఫున బరిలోకి దిగిన భట్ సెంచరీ (143 బంతుల్లో 135; 14 ఫోర్లు)తో అదరగొట్టగా ఇదే జట్టుకు ఆడుతున్న ఆసిఫ్ బౌలింగ్‌లో ఆరు ఓవర్లలో 23 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం స్వల్పకాలం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్‌లో వీరిపై నిషేధం ముగిసినా పునరావాస శిబిరంలో చేరారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ