ఆంధ్ర 173 ఆలౌట్‌ 

Published on Sat, 12/15/2018 - 01:40

నాదౌన్‌: బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. సాయికృష్ణ (74; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా... చివర్లో మనీశ్‌ (47 బంతుల్లో 32; 6 ఫోర్లు) కొన్ని పరుగులు చేశాడు. హిమాచల్‌ బౌలర్లు పంకజ్‌ జైస్వాల్‌ (5/50), అర్పిత్‌ (2/43), రిషి ధావన్‌ (2/47) ధాటికి ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ ఎదురు నిలువలేకపోయారు. ఓపెనర్‌ ప్రశాంత్‌ (0), జ్ఞానేశ్వర్‌ (19) రికీ భుయ్‌ (10) భరత్‌ (1), కెప్టెన్‌ సుమంత్‌ (9), గిరినాథ్‌ రెడ్డి (2), షోయబ్‌ ఖాన్‌ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం హిమాచల్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 51 పరుగులు చేసింది. ప్రశాంత్‌ చోప్రా (32 బ్యాటింగ్‌), ప్రవీణ్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ