జూడో చాంపియన్‌షిప్‌ విజేత హైదరాబాద్‌

Published on Mon, 11/11/2019 - 10:01

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ జూడో చాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో హైదరాబాద్‌ జట్టు విజేతగా అవతరించింది. బాలుర విభాగంలో మాత్రం హైదరాబాద్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. రెండు రోజులుగా జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో కరీంనగర్‌ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి.

ఈ పోటీలకు తెలంగాణలోని 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర విభాగంలో వరంగల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ టైటిల్‌ సాధించింది. హైదరాబాద్‌ 26 పాయింట్లతో ద్వితీయ స్థానం పొందింది. బాలికల విభాగంలో హైదరాబాద్‌ జట్టు 28 పాయింట్లతో చాంపియన్‌గా... వరంగల్‌ జట్టు 24 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ట్రోఫీలను అందజేశారు.  othe

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ