ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ

Published on Sun, 07/16/2017 - 10:45

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీలకు అర్హత సాధించింది. హరియాణాలోని సోనేపట్‌లో జరుగుతోన్న ప్రపంచ కప్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ సత్తాచాటింది. ర్యాంకింగ్‌ రౌండ్‌లో 1440 పాయింట్లకు గానూ 1376 పాయింట్లు సాధించిన సురేఖ, ఒలింపిక్‌ రౌండ్‌లో నిర్ణీత 7 పాయింట్లకు 6 స్కోరు చేసి భారత కాంపౌండ్‌ ఆర్చరీ జట్టుకు ఎంపికైంది.

 

ఈ జట్టు ఆగస్టు 8 నుంచి 13 వరకు జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాకుండా ఆగస్టు 10 నుంచి 24 వరకు చైనీస్‌ తైపీలో జరగనున్న ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లోనూ సురేఖ భారత జట్టు తరఫున బరిలోకి దిగనుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ