కావ్య మీనన్‌కు రెండు పతకాలు

Published on Sun, 09/03/2017 - 12:38

ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌


సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి కావ్య మీనన్‌ ఆకట్టుకుంది. ఐర్లాండ్‌లోని కెర్రీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రజత, కాంస్య పతకాలను సాధించింది. అండర్‌ 13–17 వయో విభాగంలో 50 కేజీల కరాటే కుమిటీ ఈవెంట్‌లో తలపడిన కావ్య వ్యక్తిగత విభాగంలో రన్నరప్‌గా నిలిచి రజతాన్ని గెలుచుకుంది. గ్రూప్‌ విభాగంలో కాంస్యాన్ని దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో 30 దేశాలకు చెందిన దాదాపు 2000 మంది క్రీడాకారులు తలపడగా, భారత్‌ నుంచి ఏడుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఐదుగురు రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.

 

ఆగస్టు 26 నుంచి 31 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి 4 రజత, 8 కాంస్య పతకాలు లభించాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన కావ్య మీనన్‌ను శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలన్న కావ్య వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు.   

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ