ఆబిద్‌ అలీ అరుదైన ఘనత

Published on Mon, 12/16/2019 - 01:06

రావల్పిండి: ఊహించిన ఫలితమే వచ్చింది. తొలి నాలుగు రోజులు వర్షం అంతరాయం కలిగించిన పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. చివరిరోజు ఎండ కాయడంతో పూర్తి ఓవర్లు సాధ్యమయ్యాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 282/6తో ఆట చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ఆరు వికెట్లకు 308 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. ధనంజయ డి సిల్వా (102 నాటౌట్‌; 15 ఫోర్లు) అజేయ సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఆబిద్‌ అలీ (109 నాటౌట్‌; 11 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (102 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీలు చేశారు. ఈ శతకంతో ఆబిద్‌ అలీ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల క్రికెట్‌లో టెస్టు, వన్డే అరంగేట్రం మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన తాను ఆడిన తొలి వన్డేలో ఆబిద్‌ అలీ 112 పరుగులు చేశాడు. పురుషుల క్రికెట్‌ కంటే ముందుగా మహిళల క్రికెట్‌లో ఈ ఘనత నమోదైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎనిడ్‌ బ్లాక్‌వెల్‌ తాను ఆడిన తొలి టెస్టు (1968లో ఆ్రస్టేలియాపై 113)లో, తొలి వన్డేలో (1973లో ఇంటర్నేషనల్‌ ఎలెవన్‌పై 101 నాటౌట్‌) సెంచరీలు చేసింది.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ