కబడ్డీ లీగ్‌లో మరో టై

Published on Fri, 07/01/2016 - 00:37

జైపూర్, బెంగళూరు మ్యాచ్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిక్యత ప్రదర్శించిన బెంగళూరు బుల్స్ చివర్లో తడబడింది. అటు కొన్ని సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా కెప్టెన్ జస్వీర్ సింగ్ కీలక పాయింట్‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. అలాగే చివరి మూడు నిమిషాల్లోనూ నాలుగు పాయింట్లు సాధించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్ 28-28తో టై అయ్యింది.

అంతకుముందు తొలి 30 నిమిషాల పాటు బెంగళూరు 23-16తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయింది. మ్యాచ్ ముగిసేందుకు నిమిషం కూడా లేని సమయంలోనూ బుల్స్ 28-26 తేడాతో ముందుంది. అయితే జస్వీర్ సింగ్ ఒక పాయింట్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు రోహిత్‌ను టాకిల్ చేయడంతో బెంగళూరుకు విజయం దూరమైంది. జస్వీర్ 9, రాజేశ్ నర్వాల్ 4 రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి వినోద్ కుమార్ 5, రోహిత్ 4 పాయింట్లు సాధించారు.
 
ఐస్ దివాస్ బోణీ
మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఐస్ దివాస్ జట్టు తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో స్టార్మ్ క్వీన్‌ను 28-15తేడాతో ఓడించింది.
 
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
యు ముంబా X దబాంగ్ ఢిల్లీ కేసీ
రాత్రి 8 గంటల నుంచి
జైపూర్ పింక్ పాంథర్స్ X బెంగాల్ వారియర్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ