క్వార్టర్స్‌లో రుత్విక

Published on Fri, 09/08/2017 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: వియత్నాం ఓపెన్‌ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయిలు గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రుత్విక క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... వృశాలి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పోరాడి ఓడింది. వియత్నాంలోని హో చి మిన్‌ సిటీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుత్విక 21–15, 21–12తో వాన్‌ యి తాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది. వృశాలి 8–21, 21–12, 10–21తో ఆరో సీడ్‌ చెన్‌ సు యు (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

భారత్‌కే చెందిన శ్రేయాన్షి పరదేశి 6–21, 21–16, 21–23తో మూడో సీడ్‌ దినార్‌ అయుస్టిన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–14, 21–12తో త్రుయోంగ్‌ తన్‌ లాంగ్‌ (వియత్నాం)పై గెలుపొందాడు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో దినార్‌తో రుత్విక శివాని; కొడాయ్‌ నరావుకా (జపాన్‌)తో లక్ష్య సేన్‌ తలపడతారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ