రన్నరప్గానే సరిపెట్టుకున్నాడు..

Published on Sun, 11/27/2016 - 14:54

కౌలూన్: తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో సమీర్ వర్మ 14-21, 21-10, 11-21 తేడాతో ఎన్జీ కా లాంగ్(హాంకాంగ్)చేతిలో ఓటమి పాలయ్యాడు. 

 

తొలి గేమ్ను కోల్పోయిన సమీర్.. ఆ తరువాత రెండో గేమ్ను సునాయాసంగా గెలిచాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్లో సమీర్ మరోసారి తడబడ్డాడు. ప్రత్యర్థి లాంగ్కు ఎత్తులకు తలవంచిన సమీర్ ఆ గేమ్ను చేజార్చుకున్నాడు. మూడో గేమ్లో కనీసం పోరాడకుండానే సమీర్ చేతులెత్తేశాడు. దాంతో రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పివి సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ