భారత టెన్నిస్‌ జట్టులో సౌజన్య 

Published on Mon, 11/18/2019 - 03:41

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్‌ జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారిణి సౌజన్య భవిశెట్టికి స్థానం లభించింది. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్‌ 1 నుంచి 10 వరకు నేపాల్‌లో జరుగుతాయి. ఇటీవల జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించిన సౌజన్య కొంపల్లిలోని సురేష్‌ కృష్ణ టెన్నిస్‌ అకాడమీ (ఎస్‌కేటీఏ)లో శిక్షణ పొందుతోంది. 26 ఏళ్ల సౌజన్య ఇప్పటివరకు అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సర్క్యూట్‌లో మూడు సింగిల్స్‌ టైటిల్స్‌... ఎనిమిది డబుల్స్‌ టైటిల్స్‌ సాధించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ