చాంపియన్‌ శ్రీవల్లి రష్మిక

Published on Sun, 08/18/2019 - 10:10

చెన్నై: తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక జాతీయ జూనియర్‌ క్లే కోర్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌గా నిలిచింది. చెన్నైలో శనివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో శ్రీవల్లి 7–6(7/3), 2–6, 6–1తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. టైటిల్‌ కోసం ఇరువురు క్రీడాకారిణులు తీవ్రంగా శ్రమించారు.

పోటాపోటీగా సాగిన మొదటిసెట్‌ను శ్రీవల్లి టై బ్రేక్‌లో సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న రేష్మా మరూరి 6–2తో సెట్‌ను కైవసం చేసుకుంది. విజేతను తేల్చే మూడో సెట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీవల్లి సెట్‌ను 6–1తో గెలిచి మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ