జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం
Published on Sat, 11/12/2016 - 15:13
- 15 మందికి తీవ్ర గాయాలు
భువనగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం సురేంద్రపురి వద్ద శనివారం చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో ఉన్న సురేంద్రపురి వద్ద తుఫాన్, స్కార్పియో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#
Tags