ముంబయిలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి!

Published on Tue, 10/18/2016 - 08:47

ముంబయి : దక్షిణ ముంబయిలోని కఫె పరేడ్ ప్రాంతంలోని మేకర్ టవర్స్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 20 అంతస్తుల భవనంలో ఈ రోజు ఉదయం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడే సరికి టవర్స్‌లోని పలువురు భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.  మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

అలాగే మంటల్లో చిక్కుకున్న 11మందిని సురక్షితంగా రక్షించారు. కాగా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎండీ శేఖర్ బజాజ్ ఫ్లాట్ నుంచి ముందుగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ