విజయం సాధించేది విశాల్ జట్టే

Published on Mon, 08/03/2015 - 02:42

తమిళసినిమా: నడిగర్ సంఘం ఎన్నికల్లో విజయం సాధించేది విశాల్ జట్టేనని నటుడు కరుణాస్ వ్యాఖ్యానించారు.ఆదివారం కయంబత్తూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా రంగస్థల నటీనటులను సినిమా రంగం ఉపయోగించుకుంటుందన్నారు. అయితే వారి ఎలాంటి అవసరాలనూ సంఘం తీర్చలేదని ఆరోపించారు. ఇక నడిగర్ సంఘంలో పెద్దకుంభకోణం జరిగిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విశాల్ జట్టు విజయం సాధిస్తుంది. ఆ తరువాత ఆయన సంఘ సభ్యుల అవసరాలన్నీ పూర్తి చేస్తారని అన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని మదురై, దిండుక్కల్, మణపారై, కారైకుడి, పుదుకోట్టై ప్రాంతాలు తిరిగి రంగస్థల నటులను కోరామన్నారు. అప్పుడు వాళ్లు సంఘం గురించి పలు ఫిర్యాదులు చేశారన్నారు. పుదుకోట్టైకు చెందిన దేవి అనే రంగస్థల కళాకారిణి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే ఆర్థికసాయం అందించామన్నారు. నడిగర్‌సంఘం సభ్యులకు మాత్రమే సాయపడాలని కరుణాస్ అన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ