జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
108,104 ఉద్యోగులకు ఉగాది కానుక
Published on Tue, 03/28/2017 - 19:57
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో 1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.
గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు జీతాల పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు పైలట్లు (డ్రైవర్లు), హెల్త్ టెక్నీషియన్లకు రూ.11,500 వేతనం ఉండేది. ఇపుడు వీరికి అదనంగా రూ.4 వేలు పెంపు వర్తించనుంది.
#
Tags