108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

Published on Tue, 03/28/2017 - 19:57

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్‌ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో  1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు జీతాల పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు పైలట్లు (డ్రైవర్లు), హెల్త్ టెక్నీషియన్లకు రూ.11,500 వేతనం ఉండేది. ఇపుడు వీరికి అదనంగా రూ.4 వేలు పెంపు వర్తించనుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ