సంక్షేమ పథకాల్లో  రాష్ట్రం ఆదర్శం

Published on Mon, 11/19/2018 - 17:55

సాక్షి,మధిర: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ గెలుపును కాంక్షిస్తూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పట్టణంలోని 18, 19 వార్డుల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాలను కొన్ని రాష్ట్రాల వారు అమలుచేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కమల్‌రాజ్‌ను గెలిపిస్తే ప్రజలకు ఉత్తమ సేవలందిస్తారని తెలిపారు.

డిసెంబర్‌ 7న జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, వైవీఅప్పారావు, వేముల శ్రీను, రంగిశెట్టి కోటేశ్వరరావు, మేకల లక్ష్మి, కూనా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ