బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. నటి అరెస్టు

Published on Sun, 07/08/2018 - 08:02

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌కు చెందిన జనార్దన్‌రావు రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్దన్‌ గతంలో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను నగరానికి తరలించి వ్యభిచారం నిర్వహించేవాడు.

ఈ క్రమంలోనే తాజాగా ముంబైకి చెందిన ఓ బాలీవుడ్‌ నటిని రప్పించాడు. సైనిక్‌పురికి చెందిన అమిత్‌ మహేంద్ర అనే విటుడిని హోటల్‌కు  పిలిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ నాగేశ్వర్‌రావు తన సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీ చేయగా రూ.40,400 నగదుతో పాటు 3 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్‌ నటి, విటుడితో పాటు సూత్రధారి జనార్దన్‌రావును అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ