విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు 

Published on Thu, 03/19/2020 - 03:26

హైదరాబాద్‌: వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్ర యంలో ప్రతిరోజు 2వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపిం చిన వారితో పాటు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఇస్తు న్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మిగతా వారిని వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.  

విమానాలు భారీగా రద్దు.. 
కొన్ని రోజులుగా ఆయా దేశాల ఆంక్షలతో పాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తో పా టు, దేశీయ ట్రాఫిక్‌ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీ య విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ