రిటర్న్‌ టు హోం

Published on Sun, 07/30/2017 - 02:43

ఖతర్‌లో సంక్షోభం 
- వెనుదిరిగిన కార్మికులు
 
మోర్తాడ్‌ (బాల్కొండ): ఖతర్‌లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతర్‌ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతర్‌ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు.

 తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్‌పై తోటి గల్ఫ్‌ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ