జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
రిటర్న్ టు హోం
Published on Sun, 07/30/2017 - 02:43
ఖతర్లో సంక్షోభం
- వెనుదిరిగిన కార్మికులు
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతర్ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతర్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు.
తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.
తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతర్పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతర్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.
#
Tags