amp pages | Sakshi

వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్‌!

Published on Fri, 06/12/2020 - 03:32

సాక్షి, హైదరాబాద్ ‌: వైద్యులపై దాడులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, వారి బంధువులు వైద్యులపై దాడి చేయ డంతో జూనియర్‌ డాక్టర్లు ఆందోళనకు దిగిన సం గతి తెలిసిందే. బుధవారం గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జూని యర్‌ డాక్టర్లతో భేటీ అయి దాదాపు నాలుగు గంటల పాటు చర్చించినా ఫలితం తేలలేదు. 

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జూడాల ప్రతినిధుల బృందంతో ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలతో పాటు డిమాండ్లను  సాను కూలంగా విన్నారు. వైద్యులపై దాడులు పరిపాటిగా మారడంతో భద్రత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్‌ ప్రధానంగా వినిపించింది. దీనిపై ఈటల స్పందిస్తూ.. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక పోలీస్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌)ను అందుబాటులో ఉంచుతామని వివరించినట్లు తెలిసింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల తాకిడి తీవ్రమైనందున ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికిత్సలకు అనుమతివ్వాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీపై తక్షణ చర్యలు చేపట్టి నియామకాలు పూర్తిచేయాలని డిమాండ్‌ చేయగా.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. జూనియర్‌ డాక్టర్లతో ప్రతి వారం చర్చలు జరపనున్నట్లు ఈటల మరోమారు స్పష్టం చేసినట్లు జూడాలు వెల్లడించారు. అయితే చర్చలకు సంబంధించి రాత్రి పొద్దుపోయే వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

మూడో రోజుకు చేరిన ఆందోళన
గాంధీఆస్పత్రి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి జూడాలు విధులు బహిష్కరించి చేపట్టిన ఆందోళన గురువారం మూడో రోజు కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. దీంతో కరోనా బాధితులకు అందే వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి పాలనా యంత్రాంగం తెలిపింది. క్వారంటైన్‌లో ఉన్న వైద్యులు, సిబ్బందిని తక్షణమే విధులకు హజరుకావాలని ఆదేశించినట్లు పేర్కొంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)