-
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ డాకర్టకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనందించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్లో పెంపుదల ఉంటుందని వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44,075 నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524 నుంచి రూ.53,503కు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు పెంచింది. స్టైఫండ్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: విశాఖ కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్ -
జూడాల ఆందోళన విరమణ
గాంధీ ఆస్పత్రి: జీవో నంబర్ 155 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనను విరమిస్తున్నామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (జూడా) అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సమ్మె నోటీసులను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య శాఖ మంత్రి హరీశ్రావుతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. మంత్రి హరీశ్రావు, వైద్య ఉన్నతాధికారులతో జూడాల సంఘ ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్లో నీట్లో ఇన్ సర్వీసు కోటా రిజర్వేషన్లు పెంచబోమని, ఎవరీకి నష్టం కలగకుండా సర్వీస్ వైద్యులు, జూనియర్ డాక్టర్స్కు సమాన ప్రతిపత్తి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూడాల సంఘ ప్రతినిధులు సాగర్, కార్తీక్, వివేక్, మణికిరణ్రెడ్డి తెలిపారు. పలు అంశాలపై పరిష్కారం కోసం మంత్రికి వినతిపత్రం అందించారు. -
నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్ 100 రూపాయల కోసం ఆక్సిజన్ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు -
ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
ఏపీ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు -
జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..విధుల్లోకి జూడాలు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా అత్యవసర, సాధారణ విధులను బహిష్కరించిన జూని యర్ డాక్టర్లు సమ్మె విరమించి గురువారం రాత్రి నుంచి విధుల్లో చేరారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో ఈనెల 26 నుంచి అత్యవసర, ఐసీయూ సేవలు మినహా విధులు బహిష్కరిం చిన సంగతి తెలిసిందే. స్టైపెండ్ పెంపు, హెల్త్కేర్ వర్కర్స్తో పాటు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో చికిత్స, పదిశాతం ప్రోత్సాహ కం, విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అనే నాలుగు డిమాం డ్లపై ఈనెల 10న సమ్మె నోటీసులు ఇవ్వగా... సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సైతం సమ్మె నోటీసు ఇచ్చి బుధవారం నుంచి విధులు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచనలతో రంగంలోకి దిగిన వైద్య విద్య సంచాలకులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపినప్పటికీ లిఖితపూర్వక హామీ రాకపోవడంతో గురువారం కూడా సమ్మె కొనసాగించారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోవిడ్–19 అత్యవసర పరిస్థితుల్లో విధులు బహిష్కరించడం సరికాదనే కోణంలో జూని యర్ డాక్టర్ల సంఘం, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో బీఆర్కే భవన్లో వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ప్రత్యేకంగా చర్చ లు జరిపారు. ఇంటర్న్షిప్ డాక్టర్లతో పాటు జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ 15% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కూడా స్టైఫండ్ 15 శాతం పెంచుతున్నట్లు అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు కరోనా బారిన పడితే జూనియర్ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్సకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా విధినిర్వహణలో మరణించిన హెల్త్కేర్ వర్కర్స్ కుటుంబసభ్యులకు పరిహారం ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కరించగా... మిగతావాటిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు స్పష్టత రావడంతో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాసరి నవీన్, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మణికిరణ్రెడ్డి, సునయ్లు చెప్పారు. త్వరలో మిగతా డిమాండ్లు సైతం పరిష్కారమవుతాయని జూడాల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్–19 అత్యవసర సమయంలో రోగులకు వైద్య సేవలు అందించాలి్సన ఆవశ్యకత దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూడాలు గురువారం రాత్రి 9 గంటల నుంచి విధుల్లో చేరడంతో రెండ్రోజుల పాటు సాగిన సమ్మెకు తెరపడింది. స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు సీనియర్ రెసిడెంట్లకు ప్రస్తుతం నెలకు రూ.70వేల చొప్పున స్టైఫండ్ ఇస్తున్నారు. దీనిని 15 శాతం పెంచాలని ప్రభుత్వానికి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్ను రూ.80,500కు పెంచింది. ఈ మొత్తాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈÐ మేరకు వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. ఇలావుండగా ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిపొ్లమా, ఎండీఎస్ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులకు సైతం ప్రభుత్వం స్టైఫండ్ను 15 శాతం పెంచింది. ఇందుకు సంబంధించి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు కూడా ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. స్టైఫండ్ పెంపు ఇలా... కోర్సు ప్రస్తుత స్టైఫండ్ పెంచిన తర్వాత హౌస్ సర్జన్మెడికల్ 19,589 22,527 హౌస్సర్జన్డెంటల్ 19,589 22,527 పీజీ డిప్లొమాలో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 సూపర్ స్పెషాలిటీలో.. మొదటి సంవత్సరం 48,973 56,319 రెండో సంవత్సరం 51,422 59,135 మూడో సంవత్సరం 53,869 61,949 పీజీ డిగ్రీ అండ్ ఎండీఎస్లో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 మూడో సంవత్సరం 48,973 56,319 పెంపు జీవో విడుదల ఇంటర్నస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ, సీనియర్ రెసిడెంట్ల (ఎస్ఆర్)కు స్టైపెండ్ 15% పెంపు. 2021 జనవరి నుంచి పెంపు వర్తింపు. స్టైపెండ్ పెంపు జీవో విడుదల నిమ్స్లో పడకలకు ఓకే జూడాలు, వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్లో పడకలు కేటాయించి వైద్యసేవలు అందించేందుకు అంగీకారం. ఇవి సీఎం దృష్టికి.. కీలకమైన ఎక్స్గ్రేషియా అంశంతో పాటు ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టమైన హామీ. -
TS: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చెస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు జూడాలు డీఎంఈతో చర్చలు కొనసాగించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇక జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వెంటనే విధుల్లో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీలు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారీ డీఎంఈతో జూడాల చర్చలు జరగనున్నాయి. చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్ -
తెలంగాణ: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
-
చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సంఘంతో వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు డిమాండ్లపై చర్చించినా డైరెక్టర్ నుం చి స్పష్టమైన హామీ రాలేదని, దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడిం చింది. పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. స్టైఫండ్ పెంపుతోపాటు ప్రోత్సాహకాలు, కోవిడ్ విధుల్లో మరణిస్తే ఇచ్చే పరిహారం, కరోనాతో బాధపడుతున్న కుటుంబసభ్యులకు నిమ్స్లో ఉచిత చికి త్స వంటి అంశాలపై జూడాలు సమ్మెకు దిగారు. తొలిరోజు సమ్మెలో భాగంగా బుధవారం అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కాగా, మిగతా విధులను బహిష్కరించారు. ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ... ప్రస్తుత సమయంలో సమ్మె సరికాదని, జూడాల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుపుతూ చర్చలు జరపాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సైతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని ట్విట్టర్ ద్వారా విన్నవించారు. ఈ క్రమంలో బుధవారం సాయం త్రం వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంపు పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పినా లిఖితపూర్వక హామీ రాలేదు. డైరెక్టర్ రమేశ్రెడ్డి జూడాల హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం బయటకు వచ్చిన జూడాల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తా మని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. అయితే సీఎం, మంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాకపోవడంతో సమ్మె ను కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. సమ్మె సరికాదు.. ‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. చీటికీ మాటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, కరోనా పరిస్థితులను కూడా చూడకుండా విధులను బహిష్కరించడం సరికాదు’. – సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నాం... లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాం. మా హామీలు అమలు చేయడం కుదరదని రమేశ్రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాలేదు. –జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశాలు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని15 శాతం పెంచాలి. మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి ‘కోవిడ్’వైద్య సేవల్లో కొనసాగుతున్న విద్యార్థులకు సైతం సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలి. కోవిడ్ విధుల్లో మరణించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకుఎక్స్గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో, జూడాల కోరిక మేరకు సత్వరమే చెల్లించాలి. జూడాలకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్లో అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి. స్తంభించిన వైద్య సేవలు జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. సకాలంలో సేవలు అందక సాధారణ రోగులు ఇబ్బందిపడ్డారు. క్లిష్టమైన ఈ సమయంలో మందులు, ఆక్సిజన్ మానిటరింగ్ చేసే వైద్యులు లేక కోవిడ్ బాధితులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కింగ్కోఠి ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రోగుల బంధువులు మద్దతు పలికారు. ఇది సమయం కాదు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. –మంత్రి కేటీఆర్ చదవండి: జూడాల సమస్యలను పరిష్కరించాలి సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
జూడాల సమస్యలను పరిష్కరించాలి: ఇందిరాశోభన్
సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లను తెలంగాణ సర్కార్ విస్మరించడం సరికాదని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జూడాలకు 10 శాతం ఇంటెన్సివ్ ఇస్తానన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందన్నారు. వేతనాల పెంపుపై గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కరోనా బారిన పడ్డ జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా పేషంట్లకు చికిత్స చేస్తున్న వారి ఆరోగ్యానికే భద్రత లేకుండా ఎలా అని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్.. జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుపై ఆరా తీయకపోవడం దురదృష్టకరమన్నారు. ఆ రోజే వాళ్లని పిలిచి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జూడాలను చర్చలకు ఆహ్వానించి.. సమ్మెను విరమింపజేయాలన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. చదవండి: ‘కేసీఆర్.. మీది గుండెనా.. బండనా..?: వైఎస్ షర్మిల సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది. చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు Etela Rajender: బీజేపీ వైపు ఈటల? -
తెలంగాణ సర్కార్కి జూడాల షాక్
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్కి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. డిమాండ్లు జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైరస్ తగ్గుతున్న వేళ తెలంగాణలో కరోనా తగ్గుమఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 28 వరకు కొవిడ్ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. అంతకు ముందే ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపే అవకాశం ఉంది. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
ఫుడ్ పాయిజన్: జూనియర్ డాక్టర్లకు అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్లో పుడ్ పాయిజన్ కారణంగా జూనియర్ డాక్టర్లు అస్వస్థతకు గురయ్యారు. ఇరవై మూడు మందికి పుడ్ పాయిజన్తో వాంతులు, విరోచానాలు కావడంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో నాసిరకం బోజనం తిని అస్వస్థత గురయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మెడికోలకు ప్రమాదం లేదని డాక్టర్ చెబుతున్నారు.. జూనియర్ వైద్యులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మెడికోలు చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ డెవిడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుడ్ పాయిజన్ కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థులు తిన్న ఆహారాన్ని ల్యాబ్ పంపించామని అన్నారు. నాణ్యత లోపాలు ఉంటే హస్టల్ నిర్వహకుల పై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. -
ఏపీ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు వర్తిస్తుంది. స్టైఫండ్ పెంపు వివరాలు.. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589, పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, ముడో ఏడాది రూ.48, 973 పెరగనుంది. అదే విధంగా పీజీ డిప్లొమా విద్యార్థులుకు మొదటి రూ.44,075, రెండో ఏడాది రూ.46524 పెంపు వర్తిస్తుంది. సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.48,973, రెండో ఏడాది రూ.51,422, మూడో ఏడాది రూ.53,899 పెరగనుంది. ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, మూడో ఏడాది రూ.48,973 పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
చుక్కేసి.. చిక్కేసిన జూడాలు
సాక్షి, సిటీబ్యూరో: మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్లోని వడోదరలో కొందరు జూనియర్ డాక్టర్లు మందు పార్టీ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వఘోడియా పోలీసులు దాడి చేసి మొత్తం 12 మంది జూనియర్ డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఓ హైదరాబాదీతో పాటు ఐదుగురు యువతులు ఉన్నట్లు వఘోడియా పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి వడోదర రూరల్ పరిధిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గుజరాత్లో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలులో ఉంది. బయటి రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి సైతం అధీకృత లేఖ ఆధారంగా మాత్రమే పరిమితంగా మద్యం విక్రయిస్తారు. ఆ రాష్ట్రంలోని వడోదర రూరల్ పరిధిలో ఉన్న సుమన్దీన్ విద్యాపీఠ్Š‡తో పాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్దీప్ ఆస్పత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కొందరు సదరు ఆస్పత్రిలో పని చేసే జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. గుజరాత్లోని మీన్నగర్ ప్రాంతానికి చెందిన జైమన్ మెహతా, ఘట్లోడియా వాసి కిరణ్ మెహతా సైతం జూనియర్ డాక్టర్లుగా పని చేస్తున్నారు. తన సహచరులైన పది మందితో కలిసి మద్యం పార్టీ చేసుకోవాలని భావించారు. దీంతో ఆదివారం రాత్రి వడోదర రూరల్ పరిధిలోని ఆమోదర్ గ్రామంలో ఈ ద్వయం నివసించే శ్యామల్ కౌంటీలో ఉన్న హౌస్ నంబర్ 112 ఈ పార్టీకి వేదికైంది. ఇందులో ఐదుగురు యువతులు సహా 12 మంది జూనియర్ డాక్టర్లు మద్యం తాగుతున్నారు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వాళ్లు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దాడి చేసిన వఘోడియా పోలీసులు డజన్ మందినీ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ ఇంటి నుంచి దేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వాసులతో పాటు హైదరాబాద్కు చెందిన జూనియర్ డాక్టర్ కోషి జోసెఫ్ ఉన్నట్లు వఘోడియా ఎస్ఐ పి.పార్మర్ ప్రకటించారు. 12 మంది జూనియర్ డాక్టర్లను అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. -
విధుల్లోకి జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, బంధువులు దాడికి పాల్పడటంతో నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. తమ సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వెంటనే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ ఆస్పత్రి విభాగం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నా... కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేస్తున్నామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రోగుల బంధువులు తమపై దాడులకు దిగడం ఏమిటంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రత అందించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయడంతోపాటు ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలనే డిమాండ్ను మంత్రికి వివరించారు. అలాగే సకల సౌకర్యాలున్న గాంధీ ఆస్పత్రిని కేవలం కరోనా చికిత్సకే పరిమితం చేయకుండా అన్ని రకాల రోగులను అనుమతించాలని కోరారు. ప్రస్తుతం పడకల సంఖ్య ఆధారంగా పోస్టులు మంజూరు చేసినప్పటికీ 30% అదనపు పోస్టులు మంజూరు చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. రిజర్వ్ స్టాఫ్ ఉంటేనే వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి ఉండదని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా చికిత్సలను గాంధీ తదితర ఆస్పత్రులకే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లోనూ ప్రారంభిస్తే గాంధీ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గుతుందని కోరారు. వైద్యులు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, ఇతరాలను జూనియర్ డాక్టర్ల సమ్మతితో కొనుగోలు చేయాలని సూచించారు. పక్షం రోజుల్లో రోడ్మ్యాప్... జూనియర్ డాక్టర్ల సంఘం డిమాండ్లపై ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కరోనా అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఆందోళన విరమించాలని సూచిస్తూనే వారి డిమాండ్ల పరిష్కారం కోసం 15 రోజుల్లో మార్గం చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. చర్చల తాలూకూ అంశాలను సీఎం కేసీఆర్కు వివరించిన తర్వాత కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, ఈలోగా విధుల్లో చేరి వైద్యసేవలను ప్రారంభించాలని కోరారు. దీంతో సమ్మతించిన జూనియర్ డాక్టర్ల సంఘ ప్రతినిధులు విధుల్లో చేరేందుకు సముఖత చూపారు. పక్షం రోజుల్లో పరిష్కారం చూపకుంటే మాత్రం మళ్లీ ఆందోళన చేపడతామని జూనియర్ డాక్టర్ల సంఘం పేర్కొంది. -
వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్!
సాక్షి, హైదరాబాద్ : వైద్యులపై దాడులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు పున రావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని భావిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులు, వారి బంధువులు వైద్యులపై దాడి చేయ డంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగిన సం గతి తెలిసిందే. బుధవారం గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జూని యర్ డాక్టర్లతో భేటీ అయి దాదాపు నాలుగు గంటల పాటు చర్చించినా ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జూడాల ప్రతినిధుల బృందంతో ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలతో పాటు డిమాండ్లను సాను కూలంగా విన్నారు. వైద్యులపై దాడులు పరిపాటిగా మారడంతో భద్రత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపించింది. దీనిపై ఈటల స్పందిస్తూ.. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్(ఎస్పీఎఫ్)ను అందుబాటులో ఉంచుతామని వివరించినట్లు తెలిసింది. అలాగే గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల తాకిడి తీవ్రమైనందున ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికిత్సలకు అనుమతివ్వాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీపై తక్షణ చర్యలు చేపట్టి నియామకాలు పూర్తిచేయాలని డిమాండ్ చేయగా.. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. జూనియర్ డాక్టర్లతో ప్రతి వారం చర్చలు జరపనున్నట్లు ఈటల మరోమారు స్పష్టం చేసినట్లు జూడాలు వెల్లడించారు. అయితే చర్చలకు సంబంధించి రాత్రి పొద్దుపోయే వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మూడో రోజుకు చేరిన ఆందోళన గాంధీఆస్పత్రి: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి జూడాలు విధులు బహిష్కరించి చేపట్టిన ఆందోళన గురువారం మూడో రోజు కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. దీంతో కరోనా బాధితులకు అందే వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి పాలనా యంత్రాంగం తెలిపింది. క్వారంటైన్లో ఉన్న వైద్యులు, సిబ్బందిని తక్షణమే విధులకు హజరుకావాలని ఆదేశించినట్లు పేర్కొంది. -
మాకు రక్షణ ఏదీ?
గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సుమారు ఆరుగంటల పాటు హైడ్రామా నడిచింది. తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూడాలు రోడ్డెక్కారు. ఆస్పత్రి ఎదుట సికింద్రాబాద్–ముషీరాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, వైద్యమంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రికి వచ్చి స్పష్టమైన, లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు ధర్నా విరమించేదిలేదని భీష్మించారు. ఈ కారణంగా ఆస్పత్రిలో వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరగడంతో కరోనా బాధితులు అసహనం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గాంధీలో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన కరోనా రోగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుమారుడు, మరో బంధువుతో కలసి వైద్యులు, సిబ్బందిపై ఇనుప చైర్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు జూడాలకు గాయాలు కాగా, భయభ్రాంతులకు గురైన జూడాలు మంగళవారం రాత్రే విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో జూడాలు, ఇంటర్నీస్, హౌస్ సర్జన్లు బుధవారం ఉదయం ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా కొనసాగించారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న తమ ప్రాణాలకే రక్షణ కరువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేశామని ధర్నా విరమించాలని పోలీసులు, ఆస్పత్రి యంత్రాంగం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ధర్నా అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించిన జూడాలు ముందస్తు పథకం ప్రకారం ఒక్కసారిగా బారికేడ్లను తొలగించి రోడ్డెక్కారు. ఈ క్రమంలో పోలీసులు, జూడాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు ఆరుగంటల పాటు రోడ్డుపై బైఠాయించిన జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల సమయంలో వైద్యమంత్రి కార్యాలయం నుంచి చర్చలకు రమ్మని కబురు అందినా, మంత్రే ఇక్కడకు రావాలని వారు పట్టుబట్టారు. తానే వస్తానని మంత్రి చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి రాకపోకలు సాగించే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జూడాల రాస్తారోకోను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాను అనుమతించలేదు. దూరం నుంచే ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనాకు మందు మీడియాను నియంత్రించడం కాదని జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటి? జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటనే అంశంపై చర్చ వైద్యవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. పారిశుధ్యలోపం, వార్డ్బాయ్స్, పేషెంట్ కేర్ టేకర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు తగినంతగా లేకపోవడమేనని భావిస్తున్నారు. ఏప్రిల్ 1న మర్కజ్ నుంచి వచ్చి కరోనా బారిన పడిన కుత్భుల్లాపూర్కు చెందిన వ్యక్తి (56) గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సదరు మృతుడు బాత్రూంకు వెళ్లి తిరిగివస్తూ కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి కూడా కర్వాన్కు చెందిన వ్యక్తి (55) కూడా సరిగ్గా అలాగే మృతి చెందాడు. ఈ రెండు ఘటనల్లో వైద్యులు, జూడాల నిర్లక్ష్యం లేదు. కాని దాడులు జరిగింది వైద్యులు, జూడాలపైనే. పారిశుధ్యం సరిగా ఉండి, తగినంత మంది షేషెంట్ కేర్ టేకర్లు, వార్డుబాయ్స్ ఉంటే పేషెంట్తోపాటు వెళ్లే వెసులబాటు ఉండేది. రోగి కిందపడి ప్రాణాలు పొగొట్టుకునే అవకాశం ఉండేది కాదని, ఇదంతా తమకు సంబంధం లేని విషయమని, దాడులు మాత్రం తమపైనే జరుగుతున్నాయని వైద్యులు, జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు పాల్పడిన ఇరువురి అరెస్ట్.. జూడాలపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడిన ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు (26), సమీప బంధువు (42)లపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ సెక్షన్ 3, తెలంగాణ మెడికేర్ యాక్ట్ సెక్షన్ 4తోపాటు ఐపీసీ 332, 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించామని అన్నారు. వైద్యులపై దాడులు దురదృష్టకరం: ఈటల సాక్షి, హైదరాబాద్: వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇలా త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో సహించం’అని అన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జూనియర్ డాక్టర్లతో చర్చించి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. హాస్పిటల్ డీసెంట్రలైజేషన్ అంశంపై సీఎం కేసీఆర్తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. జూడాల కమిటీతో ప్రతి వారం గాంధీలోనే సమావేశమవుతానన్నారు. చర్యల తర్వాత జూడాలు ఆందోళన విరమించారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. చర్చలు విఫలం.. ఆందోళన కొనసాగింపు గాంధీ ఆస్పత్రి: చర్చలు సఫలం అయినట్లు, ఆందోళన విరమించినట్లు మంత్రి పేర్కొనగా, సమస్య పరిష్కారానికి మంత్రి ఈటలతో బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం అయినట్లు గాంధీ జూడా సంఘం ప్రతినిధులు లోహిత్, శశిధర్, వంశీ, హేమంత్ స్పష్టం చేశారు. సమస్యలు, డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారని, స్పష్టమైన హామీ లభించకపోవడంతో విధుల బహిష్కరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గురువారం ఉదయం మరోమారు అంతర్గత సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని జూడాల సంఘం ప్రతినిధులు తెలిపారు. జూడాల నిరసనలకు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
2 వ రోజుకు చేరుకున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన
-
ఫీజుల పెంపుపై జూడాలు ఆందోళన బాట..
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోఠి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలకు అనుకూలంగా ఫీజులు పెంచారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. 2017లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని.. పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారంటూ జూడాలు ప్రశ్నించారు. తక్షణమే జీవో 28 ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గాంధీ నుంచి కరోనా అనుమానితులను తరలించాలి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement