వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాజీ మంత్రి సమ్మయ్య కన్నుమూత
Published on Tue, 08/22/2017 - 02:08
పరకాల: అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొచ్చు సమ్మయ్య (71) సోమవారం మృతి చెందారు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో కాలు జారిపడి తలకు తీవ్ర గాయం కావడంతో ఈ నెల 9న ఆయన్ను నిమ్స్కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టడంతో నిమ్స్లో వైద్య నిపుణుల బృందం చికిత్స అందించింది.
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సమ్మయ్య.. 1979లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా.. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పీవీ నరసింహారావు హయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. మంగళవారం పరకాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
#
Tags