జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
పర్యాటక ప్రాజెక్టులకు నిధులు మంజూరు
Published on Wed, 06/28/2017 - 02:34
కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ప్రముఖ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ. 99.42 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, మహేశ్ శర్మ వెల్లడించారు. మంగళవారం కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కార్యాలయానికి వచ్చిన కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్ శర్మ తెలంగాణకు చెందిన పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు.
అనంతరం ఇరువురూ మీడియాతో మాట్లాడుతూ కుతుబ్షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూంబ్స్, హయత్ బక్షీ మసీదు తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశామన్నారు. తెలంగాణ టూరిజం అధికారులతో సమావేశమైన అనంతరం మరిన్ని ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు.
#
Tags