amp pages | Sakshi

పల్లె నాడి పట్టని డాక్టర్‌

Published on Thu, 12/19/2019 - 02:46

సాక్షి, హైదరాబాద్‌: నగరాలకు సమీపంలోని ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అనేకచోట్ల పూర్తిస్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది ఉంటున్నారు. కానీ సుదూర ప్రాంతాల్లోని అవే కేటగిరీ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత భారీగా ఉంది. హైదరాబాద్‌ సమీపంలో పనిచేసే వారంతా సొంత క్లినిక్‌లు లేదా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఉన్నవారు కూడా హైదరాబాద్‌లోనో ఇతర నగరాల్లోనో ఉంటూ అప్పుడప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. 

డాక్టర్‌ కృష్ణమోహన్‌ (పేరు మార్చాం) సూర్యాపేట జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటారు. వారానికి రెండుసార్లకు మించి వెళ్లరు. హైదరాబాద్‌లో క్లినిక్‌ నడుపుతున్నందున దీనిపైనే దృష్టి అంతా. దీంతో ఆ పీహెచ్‌సీ పరిధిలోని రోగులు ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. 

90 శాతం మంది అంతే.. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారిలో 90 శాతం మంది వైద్యులు ఇతర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం మంది వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారని, సమయ పాలన లేకుండా డ్యూటీలకు హాజరవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షలో జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో రోగులకు అవసరమైనప్పుడు వైద్య సేవలు అందట్లేదు. ఒకవేళ డాక్టర్లకు ఇష్టం కాని ప్రాంతాలకు పోస్టింగ్‌ ఇస్తే అంతే సంగతులు.. దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారు. విచిత్రమేంటంటే గతేడాది వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే, తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌ ఇవ్వలేదని ఏకంగా 200 మంది తమ ఉద్యోగాలను వదిలేసుకున్నారు. ఆ తర్వాత 90 మంది స్పెషలిస్టులు సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. అయినా మార్పు లేకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించారు.
 
పేరుకుపోయిన ఖాళీలు.. 
రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) ఉన్నాయి. 30 నుంచి 40 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 41 ఉన్నాయి. అలాగే ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, బోధనాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలకు మంజూరైన పోస్టులకు, వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బందికి మధ్య తేడా కనిపిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి ఒక మెడికల్‌ ఆఫీసర్, ఒక స్టాఫ్‌ నర్సు సహా ఇతర పారామెడికల్‌ సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉండాలి. 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీల్లో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు సహా ఇతర పారామెడికల్‌ సిబ్బందితో కలిపి 12 మంది ఉండాలి. ఇక 30–40 పడకలున్న సీహెచ్‌సీల్లో ఒక సూపరింటెండెంట్, ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ఆరుగురు స్టాఫ్‌ నర్సులు సహా మొత్తం 14 మంది ఉండాలి.

ఏరియా ఆస్పత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, జనరల్‌ సర్జన్, అనస్థీషియా స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలి. జిల్లా ఆస్పత్రుల్లో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఉండాలి. కానీ ఖాళీలు మాత్రం చాలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు మొత్తం కలిపి 26,404 మంది ఉండాలి. అందులో 17,148 మంది పనిచేస్తుండగా.. 9,256 ఖాళీలున్నాయి. అందులో వైద్య ఖాళీలే ఏకంగా 4,201 ఉండటం గమనార్హం. అందులో వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 4,500 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 2,100 మంది మాత్రమే ఉన్నారు. 2,400 ఖాళీలు ఉండటం గమనార్హం. ఈస్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది కొరత రోగులపాలిట శాపంగా మారింది.
 
సర్కారు వర్సెస్‌ వైద్యాధికారులు.. 
ఖాళీలను ఇప్పటికిప్పుడు నింపే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పదేపదే చెబుతున్నారు. హేతుబద్ధీకరించడం ద్వారా వైద్యుల కొరతను తాత్కాలిక తీర్చొచ్చని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు నిబంధనల ప్రకారం 1512 స్టాఫ్‌ నర్సులు కావాలి. కానీ 1276 మాత్రమే ఉన్నారు. ఇంకా 236 మంది స్టాఫ్‌నర్సుల కొరత ఉంది. వారిలో కొందరిని అవసరం లేని చోట నుంచి అవసరమున్న చోటకు తరలించాలని ఆదేశించారు. అయితే హేతుబద్ధీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. మంత్రి ఆదేశాలను అమలు చేయాల్సిన వైద్యాధికారులే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ‘ప్రైవేటు ప్రాక్టీస్‌ అలవెన్స్‌ 20 శాతం వరకు ఇస్తే, అప్పుడు వైద్యులను ఒప్పించడానికి వీలుంటుందని’ఓ కీలక వైద్యాధికారి వ్యాఖ్యానించారు. 

ఎంబీబీఎస్‌ డాక్టర్లే పరిష్కారం 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగూ స్పెషలిస్టులు పని చేయడానికి ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఎంబీబీఎస్‌ డాక్లర్లను నియమిస్తే బాగుంటుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు వంటి చిన్న చిన్న జబ్బుల చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్తులకు వెళ్లాల్సి వస్తోందని, దీన్ని నివారించేందుకు ఎంబీబీఎస్‌ డాక్టర్ల నియామకం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ఎంబీబీఎస్‌ వైద్యులు తక్కువ వేతనాలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని, వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. 

ఎక్కడికంటే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు: డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, వైద్య విద్య డైరెక్టర్‌ 
వైద్యుల హేతుబద్ధీకరణ నిర్ణయం మంచిదే. కానీ స్పెషలిస్టు వైద్యులు తమకు నచ్చని చోటకు బదిలీ చేస్తే వెళ్లడానికి ముందుకు రావట్లేదు. అవసరమైతే తమ ఉద్యోగాలను వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సర్దుబాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. వైద్యులతో మాట్లాడి కౌన్సిలింగ్‌ చేసి వారిని ఒప్పించి పంపాలి. ఒత్తిడి చేస్తే వెళ్లే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే సొంత ప్రాక్టీసు వారికి ముఖ్యం. ఆ ధీమాతోనే వారు ఎక్కడికీ వెళ్లట్లేదు.   

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)