మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో

Published on Fri, 01/08/2016 - 02:47

సాక్షి, హైదరాబాద్:  మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న బీజేపీ నేత రఘునందన్‌రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి బలవంతంగా రూ.15 లక్షల చెక్కు రాయించుకున్న కేసులో మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, జరి మానా విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును లోతుగా విచారించాల్సిఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ