విధి నిర్వహణలో అధికారి మృతి

Published on Thu, 09/13/2018 - 02:59

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి అంజయ్య విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందారు. బుధవారం పత్తి మార్కెట్‌లో ప్రభుత్వం మత్స్యకారులు, గొర్రెల కాపరులకు వివిధ పథకాల కింద వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న అంజయ్య (56) మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సభావేదిక ప్రాంగణంలోనే కుప్పకూలారు. పక్కనే ఉన్న యాదవ సంఘం నాయకులు ఆయనను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.

విషయం తెలిసిన మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని అంజయ్య భార్య రాణిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృత దేహాన్ని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను హరీశ్‌రావు స్వయంగా పర్యవేక్షించారు. అంజయ్య మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సందర్శించారు. శుక్రవారం పట్టణంలోని వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. జనగామ జిల్లా కీలాసపూర్‌ గ్రామానికి చెందిన అంజయ్య ఎనిమిదేళ్లుగా జిల్లాలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నారు. ఒక మంచి అధికారిని కోల్పోయామని.. అంజయ్య మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ