amp pages | Sakshi

రాష్ట్రంలో పంజాబ్‌ బృందం పర్యటన 

Published on Fri, 11/17/2017 - 01:37

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణపై అధ్యయనానికి పంజాబ్‌ సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జీత్‌ సింగ్, అధికారుల బృందం రాష్ట్రానికొచ్చింది. ఉన్నత విద్యా మండలి, ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ, యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్లతో గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. రాష్ట్రంలో ప్రైవేటు సాంకేతిక విద్యా సంస్థల నియంత్రణకు చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణలో విద్యా విధానం బాగుందని, ఇక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుందని కితాబిచ్చారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 8 విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ రంగంలో 23 యూనివర్సిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ రంగంలోని యూనివర్సిటీలు పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయని, అక్కడ ఎలాంటి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు చేయట్లేదని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్తున్నారని, దీంతో తమ రాష్ట్రంలో 20 శాతం పాఠశాలలను మూసేసినట్లు చెప్పారు.  

తెలంగాణలో పక్కాగా నియంత్రణ 
ఈ సందర్భంగా కడియం శ్రీహరి రాష్ట్రంలో పరిస్థితులను ఆ బృందానికి వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేటు కాలేజీలపై పక్కాగా నియంత్రణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్‌ అమలు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాయాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు శాతం ఉండాలనే నిబంధన విధించామని, మొదటి సంవత్సరంలో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణత పొందితేనే రెండో సంవత్సరానికి అనుమతినిస్తున్నట్లు చెప్పారు. ఫీజు లను నియంత్రించేందుకు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో కమిటీ ఉందన్నారు. ఏటా రాష్ట్రం నుంచి వివిధ జాతీయ స్థాయి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. బృందంలో ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి. వజ్రలింగం, ఎస్‌.కె సందు, కార్యదర్శి వికాస్‌ ప్రతాప్‌ ఉన్నారు. 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)