కేటీఆర్‌పై చర్యలు తీసుకోండి: రేవంత్

Published on Thu, 11/13/2014 - 02:06

లేకుంటే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం: రేవంత్
 సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌లా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి కె.తారక రామారావుపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘నిండు సభలో టీడీపీ సభ్యులను ఆంగ్లో ఇండియన్ అని అనడం ద్వారా కేటీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్పీకర్ సభ్యులందరికీ సభాపతి. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆయన పై ఉంది’ అని చెప్పారు. కేటీఆర్‌కు అబద్ధాలు చెప్పడం సాధారణమై పోయిందన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ