కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌ ఆంక్షలపై ఉత్కంఠ!

Published on Sun, 04/19/2020 - 15:16

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను ప్రగతిభవన్‌లో ఈ భేటీ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఏప్రిల్‌ 20 నుంచి కొంతమేర సడలింపు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలను సైతం కేంద్రం విడుదల చేసింది. అయితే నేడు జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ముఖ్యంగా వీటిపైనే చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే  ఎజెండా కూడా తయారు చేశారని, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్‌ గడిచిన రెండు రోజులుగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం..!
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో కరోనా సంఖ్య పెరుగుతుండటంతో.. లాక్‌డౌన్‌ సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం విముకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మినహాయింపులు ఇస్తే ఏఏ రంగాలకు ఇవ్వాలి..? వేటికి కొనసాగించాలని అనే దానిపై నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్‌ భేటీ అనంతం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా  కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి మినహాయింపులు లేకుండానే లాక్‌డౌన్‌ కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.

పెరుగుతున్న కరోనా కేసులు..
వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరింది. ఇప్పటివరకు 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అలాగే 18 మంది కరోనా బారినపడి మరణించారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)