amp pages | Sakshi

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

Published on Thu, 05/10/2018 - 01:18

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేట: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధ వారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుద్దెడ, సిద్దిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ ఏడాది రబీలో 38 లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

రైతులకు అందుబాటులో 3,008 కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి 17% తేమకు లోబడి ఉండేలా చూసి విక్రయించాలన్నారు. 2,962 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.36 లక్షలమంది రైతుల నుంచి రూ.2,526 కోట్ల విలువ చేసే 15.91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు. ఇందులో 15.01 లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేశామన్నారు.  ముందస్తు వర్ష సూచనలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వీలైనంత త్వరగా రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌ విషయంలో మిల్లర్లు వేగంగా స్పందించాలన్నారు. ఇదే అంశంపై ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.
 
టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోండి 
11వ తేదీ నుంచి వర్షాలు కురిసే సూచనలున్నాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల దృష్ట్యా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు 9.78 కోట్ల గోనె సంచులు అవసరం కాగా, ఇప్ప టికే 9.31 కోట్ల సంచులను అందుబాటులో ఉంచామన్నా రు. ఈ పర్యటనలో అకున్‌ సబర్వాల్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు.   

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)