చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'
Published on Wed, 10/07/2015 - 09:02
వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆఫ్ఘాన్లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్బెల్ వివరణ ఇచ్చారు.
శనివారం కుండజ్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘాన్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్బెల్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుండజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్లో భాగంగా ఆఫ్ఘాన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్బెల్ చెప్పారు.
#
Tags