బాధితులకు ప్రముఖుల బాసట

Published on Sun, 10/13/2013 - 12:54

పై-లీన్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని చూసిన బాలీవుడ్ ప్రముఖులు చలించిపోయారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ సందేశాలు పంపారు. గడిచిన 14 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసాన్ని సృష్టించిన పై-లీన్ తుఫాను కారణంగా ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరు ఏమన్నారంటే..

అమితాబ్ బచ్చన్: దేవుడి ఆగ్రహం పై-లీన్ తుఫాను రూపంలో కనిపించింది!! అందరూ జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కలవారినీ రక్షించాలి. అందరి కోసం ప్రార్థించండి!

T 1186 -The fury of the God's in cyclone #Phailin !! Be careful, beware and be protected .. and be in prayer !!

— Amitabh Bachchan (@SrBachchan) October 12, 2013