‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’

Published on Sun, 01/22/2017 - 15:08

అమృత్‌ సర్‌: ‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాకు సంబంధం లేదు. దీనికి నన్ను శిక్షించొద్ద’ని బీజేపీకి చెందిన పంజాబ్‌ మంత్రి అనిల్‌ జోషి పేర్కొన్నారు. అమృత్‌ సర్‌ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన మరోసారి బరిలో నిలిచారు. ఎవరో తీసుకున్న నిర్ణయానికి తనను శిక్షించొద్దని ఓటర్లకు జోషి విజ్ఞప్తి చేస్తున్నారు.

‘నా పదవీ కాలం ముగిసింది. ఈ ఒక్క నెల మీరందరూ కష్టపడాలి. ఓటర్ల దగ్గరకు వెళ్లి నాకు ఓటు వేయాలని కోరండి. పాత నోట్ల రద్దు నిర్ణయంతో అంతా తల్లకిందులయిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. దీనిపై ఇప్పుడేమీ చేయలేమని సముదాయించండి. ఇందులో అనిల్ జోషి పాత్ర లేదని చెప్పండి. జోషి ఎప్పుడూ మీ తరపున పోరాడతాడని ప్రజలకు తెలపండి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు జాగ్తత్తగా వ్యవహరించాల’ని తన మద్దతుదారులకు సూచించారు.

డీమోనిటైజేషన్‌ ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని తనను తాను ‘వికాస పురుషుడు’గా ప్రకటించుకున్న జోషి పేర్కొన్నారు. అకాలీదల్ ప్రభుత్వంతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తున్న జోషి తన ప్రచారంలో ఎక్కడా సీఎం ప్రకాశ్‌ సింగ్ బాదల్ పేరు ప్రస్తావించడం లేదు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ