తీవ్రవాదులు దాడి : ఎనిమిది మంది మృతి

Published on Fri, 03/21/2014 - 08:35

ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతంలోని సెరినా హోటల్లో తీవ్రవాదులు తుపాకితో గతరాత్రి స్వైర విహారం చేశారు. తీవ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో ఎనిమిది మంది మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు,ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహరాల శాఖ మంత్రి శుక్రవారం ఉదయం వెల్లడించారు.

 

వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆ ఘాతుకానికి ఒడిగట్టిన నలుగురు యువ తాలిబన్లను హతమార్చారని తెలిపారు. ఆ దాడి జరిగిన సమయంలో ఆఫ్ఘాన్లోని భారతీయ ఉన్నతాధికారులు అదే హోటల్లో ఉన్నారని అయితే వారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ