ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది!

Published on Tue, 09/27/2016 - 09:38

వాళ్లిద్దరికీ పెళ్లయ్యి మహా అయితే ఏడాది అవుతుంది. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కీచులాటలే. ఆమె ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. దాని గురించి గట్టిగా ప్రశ్నించాడని.. చివరకు భర్తను బెడ్రూంలోనే పొడిచి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని నలందలో జరిగింది. లహేరి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే సతీష్ - లలితలకు ఏడాది క్రితం పెళ్లయింది. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని, చాలా కష్టమ్మీద పెళ్లికి ఒప్పించామని ఆమె తండ్రి చెబుతున్నారు.

నిజానికి సతీష్ కూడా లలితను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆమె అక్క సంగీతను పెళ్లాడాలని అనుకున్నాడు. కానీ ఆమె తన బావగారితో కలిసి ఎటో వెళ్లిపోయింది. దాంతో తప్పనిసరిగా లలితను పెళ్లాడాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత తన కూతురు అతడితో సుఖంగా లేదని ఆమె తండ్రి చెబుతున్నారు. ఇక ఆమె తరచు ఎవరితోనో ఫోన్లలో మాట్లాడుతుండటాన్ని అతడు గట్టిగా ప్రశ్నించాడు. దాంతో పట్టలేని కోపం వచ్చిన ఆమె.. అతడు పడుకొని ఉండగా మంచం మీదే అతడిని పొడిచేసింది. దాంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో మరణించాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ