నరేంద్ర మోడీ కోసం నా సీటుకు ఎసరా?

Published on Sun, 03/09/2014 - 02:21

రాజ్‌నాథ్‌ను నిలదీసిన మురళీ మనోహర్ జోషీ
 సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీలో లుకలుకలు పొడచూపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్‌లు శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను నిలదీశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై అక్కడి సిట్టింగ్ ఎంపీ జోషీ మండిపడ్డారు. మోడీ కోసం తన స్థానానికి ఎసరుపెట్టడం ఏమిటని నిలదీశారు. ఒకవేళ ఈ ప్రచారమంతా ఒట్టిదైతే దానిపై వివరణ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మరోవైపు పార్టీలోకి కేజేపీ (యడ్యూరప్ప), బీఎస్‌ఆర్ కాంగ్రెస్ (బి. శ్రీరాములు) విలీనాన్ని బాహాటంగానే వ్యతిరేకించిన సుష్మాస్వరాజ్...అవినీతిపరులను పార్టీలో తిరిగి చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం భేటీ మధ్యలోనే వారు బయటకు వెళ్లిపోయారు.
 
 52 మందితో బీజేపీ రెండో జాబితా
 లోక్‌సభ ఎన్నికలకు 52 మందితో పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. కర్ణాటక నుంచి 20 మందికి, పశ్చిమ బెంగాల్ నుంచి 17 మంది, ఒడిశా నుంచి ఐదుగురు, అస్సాం నుంచి ఐదుగురు, కేరళ నుంచి ముగ్గురు, త్రిపుర నుంచి ఇద్దరు అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది. వీరిలో 16 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ నుంచి వైదొలగి సొంత పార్టీ (కేజేపీ) పెట్టుకొని తిరిగి ఇటీవల బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఈ జాబితాలో చోటు దక్కింది. షిమోగా స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)