మాజీ ఎంపీ వర్సెస్ మాఫియా డాన్

Published on Fri, 03/31/2017 - 14:26

న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఇద్దరు కరడుగట్టిన నేరస్తుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్, అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ వ్యవహారం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. తీహార్ జైలులో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉన్నారు. చోటారాజన్ ఉన్న గదిలో అధికారులు టీవీ ఏర్పాటు చేయడంపై షహబుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు కూడా టీవీ కావాలని అధికారులకు లేఖ రాశాడు. టీవీలో లేకపోవడంతో బోర్ కొడుతోందని, ఒంటరిగా ఫీలవుతున్నానని పేర్కొన్నాడు. రాజన్ గది నుంచి వస్తున్న మ్యూజిక్ తనకు నిద్రాభంగం కలిగిస్తోందని తెలిపాడు.

45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షహబుద్దీన్ ను తీహార్ నంబరు వన్ జైలులో ఉంచారు. కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో తమిళనాడు ప్రత్యేక పోలీస్ జవాన్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. షహబుద్దీన్ అభ్యర్థనపై జైలు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ