జలపాతంలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Published on Sat, 08/08/2015 - 23:02

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం చూసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన ఒత్తూరి చైతన్య(24) తొమ్మిది మంది స్నేహితులతో కలసి శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వచ్చారు.

జలపాతం పైభాగం నుంచి దాటే క్రమంలో చైతన్య కాలు జారి అందులో పడిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని దుండిగల్‌కి చెందిన చైతన్య పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని గజ ఈతగాళ్లు సాయంత్రానికి వెలికితీయగా, బోథ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ