జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు: కన్నబాబు
Published on Mon, 06/21/2021 - 21:57
సాక్షి, అమరావతి: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రూ.1584 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలిదశలో రూ.659 కోట్లతో 1255 బహుళ ప్రాయోజిత కేంద్రాలను, రెండో దశలో రూ.925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ నాటికి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా మరో 25 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని
#
Tags