జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
‘భద్రక్-విజయనగరం’ రైల్వే లైన్కు కేంద్రం మొండిచేయి?
Published on Fri, 07/23/2021 - 15:57
న్యూఢిల్లీ: భద్రక్-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన మూడో రైల్ లైన్ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి రూపొందించిన డీపీఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.3,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆమోదానికి నోచుకోకపోవడంతో కాలయాపన వలన ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు.
#
Tags