కమ్యూనిటీ హాలే.. టీడీపీ కార్యాలయం 

Published on Mon, 09/06/2021 - 09:23

వినుకొండ(నూజెండ్ల): వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారని, కులధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మ ఉండకూడదని కోర్టుల్లో కేసులు వేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నాయకులు మాత్రం ఏకంగా ప్రభుత్వ భవనాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా మార్చారు. వినుకొండ నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో అవుదారి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రధాన సెంటర్‌లో స్థలాన్ని కేటాయించి భవనాన్ని నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పనులకు ప్రభుత్వ కమ్యూనిటీ హాల్‌ను ఉపయోగించుకున్నారు.

అయితే టీడీపీ హయాంలో సుమారు రూ.15లక్షల ఎంపీ నిధులు, గ్రామస్తుల ఆర్థిక సహకారంతో కమ్యూనిటీ హాల్‌ నిర్మించారు. టీడీపీ పార్టీ రంగులు వేయించి ఎన్‌టీఆర్, టీడీపీ గుర్తులను కూడా వేయించుకుని యథేచ్ఛగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లను వేయించుకుని స్థలదాత పేరును ఒక మూలన రాశారు. గ్రామ సచివాలయాలు నిర్మాణదశల్లో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం అద్దె భవనాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అయితే కారుమంచి గ్రామంలో ప్రభుత్వ భవనాన్ని గ్రామపంచాయతీకి అప్పగించాలని గ్రామస్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు 
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ