మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు

Published on Tue, 09/29/2020 - 05:15

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో మొదటి దశలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అమూల్‌ సహకారంతో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ‘వైఎస్సార్‌ చేయూత’ లబ్ధిదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమంపై తన సహచర మంత్రులతో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

► ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఇప్పటికే కొత్తగా 11,270 రిటైల్‌ (కిరాణా) దుకాణాలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. 
► అనంత, చిత్తూరు, కృష్ణా, తూ.గోదావరి, విశాఖ జిల్లాల్లో రిలయెన్స్‌ రిటైల్‌ సంస్థ రైతుల నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని అధికారులు వివరించారు. కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమైన రిలయెన్స్‌ జియో మార్ట్‌ మోడల్‌ ఇతర జిల్లాలకు విస్తరించాలని మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. 
► వ్యాపారాలను ప్రారంభించే లబ్ధిదారులు, వ్యాపార దిగ్గజ సంస్థలను అనుసంధానం చేస్తూ సెర్ప్‌ రూపొందించిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ