‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. ఇంకా సాక్ష్యం ఏం కావాలి’

Published on Thu, 12/01/2022 - 15:04

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయంలో ఎప్పుడైనా బీసీలకు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. 

కాగా, మంత్రి కారుమూరి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అన్ని పదవుల్లో బీసీలకు సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పనంతా దాచుకోవడం.. దోచుకోవడమే. మళ్లీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే. పోలవరం నిధులను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీయే అన్నారు’ అని తెలిపారు. 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ