బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు

Published on Tue, 09/20/2022 - 09:36

విజయవాడ : బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో న్యాయస్థానం (స్పీడ్‌ ట్రయల్‌ కోర్టు) జడ్జి డాక్టర్‌ ఎస్‌.రజిని సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్‌ కరకట్ట ప్రాంతానికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన తన్నీరు నాగార్జున (20) పలుమార్లు అత్యాచారం చేసిన వైనం 2017 ఏప్రిల్‌ 29న వెలుగులోకి వచ్చింది.

అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కేసు విచారణాధికారి విజయవాడ పశ్చిమ పోలీస్‌ డివిజన్‌ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ నిందితుడిని అరెస్టుచేసి 2021 మే లో∙చార్జిషీట్‌ దాఖలు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.వి.నారాయణరెడ్డి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారసంస్థను ఆదేశించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ