పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోలుకున్నవారు లక్ష దాటారు
Published on Thu, 08/06/2020 - 04:25
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ను జయించిన వారి సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 8,729 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కి చేరగా రికవరీ రేటు 55.97 శాతానికి పెరిగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 60,576 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 10,128 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. మరో 77 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,681కి పెరిగింది. యాక్టివ్ కేసులు 80,426 ఉన్నాయి.
#
Tags